జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకొన్న ఆంధ్రప్రదేశ్ మహిళ.

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకొన్న ఆంధ్రప్రదేశ్ మహిళ.

గణితం, సైన్స్‌ బోధనలో టెక్నాలజీని ఉపయోగించి నూతన పద్ధతిలో విద్యాబోధన చేస్తున్నందుకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన అధ్యాపకురాలు సుసత్యరేఖ గారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు.

“పిల్లలను తరగతి గది వైపు ఆకర్షించడంలో, అక్కడి కార్యక్రమాల్లో వారు లీనమయ్యేలా చూడటంలో సుసత్య రేఖ విజయం సాధించారు. విద్యా అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించడానికి కృషి చేశారు. భవిష్యత్తులోనూ ఆమె తలపెట్టే కార్యక్రమాలు సత్ఫలితాలు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాను” ~ అని ప్రధాని మోదీ గారు అవార్డు గ్రహీత రేఖ గారికి అభినందనలు తెలియజేశారు.