నేడు గుంటూరు పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.

నేడు గుంటూరు పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.

గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పార్టీని పటిష్టపరిచేందుకు కృషిచేయాలని సూచించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల పైనా, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా, బి.జె.పి పై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించారు.

కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేపట్టిన చర్యలను మరియు వివిధ కేంద్ర ప్రభుత్వ పధకాలను ప్రజలకు వివరించడానికి తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించారు.

నియోజకవర్గాల వారీగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పార్టీ తరుపున ఏవిధమైన కార్యక్రమాలు నిర్వహించాలి, బూత్ స్థాయిలో కార్యకర్తలను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు, ఇన్-ఛార్జ్ వి.మురళీధరన్ గారు, కో ఇన్-ఛార్జ్ సునీల్ ధియోధర్ గారు, రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరసింహా రావు గారు, తదితర నాయకులు పాల్గొన్నారు.