భారతీయ జనతా పార్టీలోకి చేరిన 200 మంది విజయవాడ బ్రాహ్మణ పురోహిత సంఘం సభ్యులు.

భారతీయ జనతా పార్టీలోకి చేరిన 200 మంది విజయవాడ బ్రాహ్మణ పురోహిత సంఘం సభ్యులు.

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు తురగ నాగభూషణం గారి నేతృత్వంలో విజయవాడ బ్రాహ్మణ పురోహిత సంఘానికి చెందిన 200 మంది సభ్యులు, బి.జె.పి సర్కారు అమలు చేస్తున్న పలు పథకాలకు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై, ఎ.పి లో బి.జె.పి బలోపేతం ద్వారా ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధిలో భాగం కావాలనే సదుద్దేశంతో భారతీయ జనతా పార్టీలో చేరారు.

గత ఎన్నికల సమయంలో బ్రహ్మణులకి చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, బ్రాహ్మణ కార్పోరేషన్ ద్వారా అరకొర నిధులు ఇస్తూ, విజయవాడలో సుమారు 40 దేవాలయాలను కూల్చి, బ్రాహ్మణులను, హిందూ సమాజాన్ని దారుణంగా మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దింపి, మన సంస్కృతిని, భారతీయతను కాపాడే భారతీయ జనతా పార్టీకి మద్దతుగా పార్టీలో చేరామని బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు, ఉపాధ్యక్షులు తురగ నాగభూషణం గారు, జాతీయ మహిళా మోర్చా ఇన్-ఛార్జ్ పురంధేశ్వరి గారు, తదితర నాయకులతో పాటు, పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు పాల్గొన్నారు.