నేడు శ్రీకాళహస్తిలో తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు.

నేడు శ్రీకాళహస్తిలో తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు.

నియోజకవర్గంలోని ప్రస్తుత పరిస్థితులు, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం, నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పార్టీ తరుపున ఏ విధమైన కార్యక్రమాలు నిర్వహించాలి వంటి విషయాలపై చర్చించారు.

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బిజెపి ఇన్-ఛార్జ్ వి.మురళీధరన్ గారు, కో ఇన్-ఛార్జ్ సునీల్ ధియోధర్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి గారు, మాజీ అధ్యక్షులు చిల్కం రామచంద్రారెడ్డి గారు, కోలా ఆనంద్ గారు తదితర నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.