కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ గారితో భేటీ అయిన ఎ.పి బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ గారు.
ఏపిలో శాంతిభద్రతలు క్షీణించాయని, బిజెపి నాయకులపై, కార్యకర్తలపై దాడులు పెరిగాయని రాజ్ నాధ్ సింగ్ గారికి ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని, ఏపీలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని,ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా వారిపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు.
అమిత్ షా తిరుమల వచ్చినప్పుడు దాడి జరిగింది.అంనతపురంలో గెస్ట్ హౌస్ లో ఉన్నప్పుడు నాపై దాడి జరిగింది.పక్కా ప్రణాళిక ప్రకారమే దాడులు జరుగుతున్నాయి.
మాపై దాడులు జరుగుతుంటే తిరిగి మా కార్యకర్తలపైనే అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు. నా టెలిఫోన్ ట్యాపింగ్ కూడా జరుగుతోందని తెలిపారు.
ఈ విషయాలన్నిటి పైనా కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని హోంమంత్రిని కోరారు. హోంమంత్రి రాజనాధ్ సింగ్ కి వీటన్నింటిపై లేఖ కూడా ఇచ్చారు. వీటన్నింటిపై విచారణ జరిపిస్తామని కేంద్ర హోంమంత్రి చెప్పారు.