ఈ రోజు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల నాయకుల సమావేశం విశాఖపట్నం లో నిర్వహించారు

ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ కేంద్రం అన్ని రాష్ట్రాల కంటే అధికంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు కేంద్ర పథకాలను తన వ్యక్తిగత పథకాలు గా ప్రచారం చేసుకుంటూ కేంద్రం పై దుష్ప్రచారం చేసి ప్రజలను మోసాగిస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా నూతన కార్యవర్గ సభ్యులకు చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారలను గ్రామ, మండల మరియు అసెంబ్లీ స్థాయి సమావేశాలు నిర్వహించి ఖండించాలి అన్నారు.

ఈ సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ కంభంపాటి హారిబాబు గారు, శాసనసభ్యులు శ్రీ విష్ణుకుమార్ రాజు గారు, శాసనమండలి సభ్యులు శ్రీ మాధవ్ గారు,జాతీయ కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి శాంత రెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు, తదితర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు