ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశమునకు ముఖ్య అతిధిగా ఇన్-ఛార్జ్ శ్రీ మురళీధరన్ గారు పాల్గొన్నారు.

“రానున్న రోజులలో ప్రతీ కార్యకర్త క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఈ కాలంలో మనం ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ ఒక్కరినీ కలుసుకుని చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం పైనా, ప్రధాని నరేంద్ర మోదీ గారి పైనా చేస్తున్న దుష్ప్రచారం గురించి మరియు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం చేసిన పనుల గురించి తెలియచేయాలి.” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి నాయకులు, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి రవీంద్ర రాజు గారు,మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.