తదుపరి ఎన్నికల్లో టిడిపిని ఓడించాల్సిన చారిత్రాత్మక అవసరం ఉంది : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు

తదుపరి ఎన్నికల్లో టిడిపిని ఓడించాల్సిన చారిత్రాత్మక అవసరం ఉంది : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు

“2019 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని గెలిపించుకోవడం ఎంత ముఖ్యమో టిడిపిని ఓడించడం కూడా అంతే ముఖ్యం. రాష్ట్రంలో టిడిపి దారుణంగా అవినీతికి పాల్పడుతోంది, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో టిడిపి విఫలమైంది. బిజెపి అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. టిడిపి మాదిరిగా కాకుండా, అవినీతి రహిత పరిపాలనను రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతాం” అని అన్నారు.

ప్రకాశం జిల్లాను ఇప్పటికే ఉన్న 7 వెనుకబడిన జిల్లాల జాబితాలో చేరు స్తామని ఆయన హామీ ఇచ్చారు. టిడిపి ప్రభుత్వం చేస్తున్న అవినీతి పాలనను అంతం చేయడానికి సెప్టెంబరు 15 నుండి అన్ని జిల్లాలను సందర్శిస్తానని తెలియచేసారు.