ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, పార్లమెంటు స్థాయి నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశమునకు ముఖ్య అతిధిగా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు పాల్గొన్నారు.
కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ “రానున్న రోజులలో ప్రతీ కార్యకర్త క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఈ కాలంలో మనం ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ ఒక్కరినీ కలుసుకుని చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం పైనా, ప్రధాని నరేంద్ర మోదీ గారి పైనా చేస్తున్న దుష్ప్రచారం గురించి మరియు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం చేసిన పనుల గురించి తెలియచేయాలి.” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు శ్రీ సోము వీర్రాజు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు, జిల్లా బిజెపి అధ్యక్షుడు శ్రీ మాల కొండయ్య గారు, నాయకులు,మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.