భారతరత్న వాజపేయి గారి విగ్రహ ఆవిష్కరణ.
మాజీ ప్రధాని,భారతరత్న, “అటల్ బిహారీ వాజపేయి” విగ్రహం దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా గోదావరి ప్రాంతం అందునా రాజమహేంద్రవరం శాటిలైట్ సిటీ బి బ్లాక్ మోడల్ హౌస్ దగ్గర ఆవిష్కరించారు.
భారతీయ జనతా పార్టీ రాజమహేంద్రవరం రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు ముఖ్య అతిథిగా వచ్చి వాజపేయి గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షులు బొమ్ముల దత్తు గారు, మండల బిజెపి అధ్యక్షుడు యానాపు ఏసు గారు తదితర నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.