ఈ రోజు భారతీయ జనతా పార్టీ అనంతపురం పార్లమెంట్ కార్యవర్గం సమావేశం నిర్వహించారు.

 

ఈ రోజు భారతీయ జనతా పార్టీ అనంతపురం పార్లమెంట్ కార్యవర్గం సమావేశంనిర్వహించారు.

జిల్లా అధ్యక్షుడు జే. అంకాల్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఇన్చార్జ్ శ్రీ.మురళి ధరన్ గారు, రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి రవీంద్ర రాజు గారు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి గారు,బిజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి గారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఒక్క కార్యకర్త అవహగన కలిగి ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వ అసత్య ప్రచారం ప్రతి కార్యకర్త తిప్పికొట్టాలని తెలిపారు.

చంద్రబాబు నాయుడు తాను గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఇప్పుడు బిజెపి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, 2019 ఎన్నికల కు బీజేపీ కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

అనంతరం జిల్లా సోషల్ మీడియా జిల్లా, అసెంబ్లీ కన్వీనర్ లకు నియమకాలను అందచేశారు.ఈ కార్యక్రమానికి అనంతపురం పార్లమెంటు లోని అన్ని అసెంబ్లీల ముఖ్య నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.