ఈ రోజు ఆంధ్రప్రదేశ్ భాజపా రాష్ట్ర ఎస్సి మోర్చా అధ్యక్షులు ఇస్కా సునీల్ గారి అధ్యక్షతన తొలి పదాధికారుల సమావేశం నిర్వహించారు.

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ భాజపా రాష్ట్ర ఎస్సి మోర్చా అధ్యక్షులు ఇస్కా సునీల్ గారి అధ్యక్షతన తొలి పదాధికారుల సమావేశం నిర్వహించారు.

దీనికి ముఖ్య అతిధిగా భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు తురగా నాగభూషణం గారు హాజరయ్యారు.

ఈ సమావేశంలో …

రాబోవు కాలములో భాజాపా లో ఎస్సి మోర్చా పాత్ర, ఎన్నికలను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించారు.

ఈ సమావేశంలో సునీల్ గారు మాట్లాడుతూ …

సెప్టెంబర్ నెలలో ఎస్సి మోర్చా ఆధ్వర్యంలో ఒక భారీ బహిరంగ సభ జరగబోతున్నదని, ఈ సభకు ముఖ్య అతిధిగా జాతీయ ఎస్సి మోర్చా అధ్యక్షులు, మరియు ఒక కేంద్రమంత్రి పాల్గొంటారని తెలియచేసారు. సెప్టెంబర్ 3 న పూర్తి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

నాగభూషణం గారు మాట్లాడుతూ …

పార్టీకి ఎస్సి లు ఎంత ముఖ్యమో తెలియచేసారు. ఒక దళితుడిని,ఒక మైనారిటీని రాష్ట్రపతి ని చేసిన పార్టీ భాజాపా నే అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సిలకు ఎన్నో పథకాలు, మరియు ఎస్సిలకు కాలనీలో సి.సి రోడ్లు, ఎల్.ఈ.డి బల్బులు,మరుగుదొడ్లు, పట్టణ అనుసంధానం కోసం రోడ్లు నిర్మిస్తున్నారని తెలిపారు. రాబోవు కాలంలో సునీల్ గారు పెద్ద నాయకుడు గా ఎదుగుతారని అన్నారు.

ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ భాజపా మీడియా ఇంచార్జి వుల్లురి గంగాధర్,మరియు పాలకొల్లు మాజీ ఎ. ఎం.సి. ఛైర్మెన్ ఉన్నమట్ల కపర్దితో పాటు 17 మంది జిల్లా పదాధికారులు పాల్గొన్నారు.