ఈరోజు అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
“రానున్న 9 నెలలు చాలా కీలకమైనవి, ప్రతీ కార్యకర్త క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఈ కాలంలో మనం ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ ఒక్కరినీ కలుసుకుని చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం పైనా, ప్రధాని నరేంద్ర మోదీ గారి పైనా చేస్తున్న దుష్ప్రచారం గురించి మరియు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం చేసిన పనుల గురించి తెలియచేయాలి.” అని తెలిపారు.
చంద్రబాబు నాయుడు తాను గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఇప్పుడు బిజెపి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, 2019 ఎన్నికల కు బీజేపీ కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు జే. అంకాల్ రెడ్డి గారు, ముఖ్య అతిథిగా రాష్ట్ర ఇన్-ఛార్జ్ శ్రీ.మురళి ధరన్ గారు, రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి రవీంద్ర రాజు గారు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి గారు,బిజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి గారు, మాజీ ఎం.ఎల్.ఎ పార్థసారథి గారు తదితర నాయకులతో పాటు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.